సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ గాంధీ పార్క్ వద్ద జరిగిన సత్యహరిచంద్రియ నాటక ప్రదర్శన సందర్భంగా సూర్యాపేట జిల్లా విద్యుత్ అధికారి చిట్యాల సతీష్ పాల్ రాజు కళా రంగ విశిష్ట సేవలకు గుర్తుగా శ్రీ శ్రీ కళావేదిక ప్రపంచ సాహితి కళా ఉత్సవాలలో పాల్గొన్న చిట్యాల సతీష్ పాల్ రాజ్ కళా రంగం తరఫున మార్వెల్స్ బుక్ వరల్డ్ రికార్డులొ పేరు నమోదు చేసుకున్నందుకు చిట్యాల సతీష్ పాల్ రాజ్ రంగస్థలం "కీర్తి కిరీటి బిరుదు" ప్రధానం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య డాక్టర్ సతీష్ పాల్ రాజ్ ను అభినందించి ఘనంగా సత్కరించారు.. సతీష్ పాల్ రాజు అనేక పౌరాణిక జానపద నాటకాలలో అద్భుత ప్రదర్శనను ఇచ్చినందుల కు సత్య హరిచంద్ర నాటకంలో కాటిసీను చింతామణి నాటకంలో భవాని శంకరుడు బిల్లా మాంగళికుడిగా పల్నాటి యుద్ధం నాటకంలో అలరాజు పాత్ర శ్రీకృష్ణదేవరాయబారం నాటకంలో సెంటర్ శీను పాత్రలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గుంటి పిచ్చయ్య జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధర్మూరి వెంకటేశ్వర్లు జానపద కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దోoతగాని సత్యనారాయణ సినీ రంగస్థలం కళాకారులు గుండు వెంకటేశ్వర్లు సాదా వీరమని షేక్ ముస్తఫా బోనగిరి ప్రకాష్ బాబు బత్తిని ధర్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సతీష్ పాల్ రాజు కి కీర్తి కిరీటి బిరుదు రావడం పట్ల సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ కార్యదర్శి దద వెంకన్న అనిత సామాజిక ,సాంస్కృతిక , సాహితి అభిలాషలు హమీద్ ఖాన్ దాచేపల్లి లక్ష్మి జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు గాయకులు వల్లంపట్ల అబ్రహం కవి రచయిత సీనియర్ జర్నలిస్టు కందుకూరి యాదగిరి ఇతరులు హర్షo వ్యక్తం చేశారు....
-----------------------
Admin