సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మేడారం జాతర 70 రోజుల గడువు మాత్రమే ఉన్న ఇంకా పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం పచ్చని మేడారం ను ఎడారిను తలపించేలా చేశారు దుకాణాలు పెట్టుకుని బతుకుతున్న వారి జీవనోపాధి దెబ్బ కొట్టారు. రైతుల పంట నష్టం కోరితే ఇంత వరకు సమాధానం లేదు. పైగా విఐపి పార్కింగ్ టాయ్లెట్స్ అంటూ ఇంకా నష్టాన్ని చేస్తున్నారు గుడి మూడు ఏకరల్లో ఉంటే .. గుడి వెనకాల 20 ఏకరాలను రైతుల నుంచి జప్తి చేసుకుని ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటిలో ఎన్ని భవంతులు కడతారో వేచి చూడాలి ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేయడం మానుకోవాలి కమిషన్ల కోసమే మేడారం జాతర పనులు కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం రోజున ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ లను బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు
-----------------------
Reporter