సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం కేంద్రం లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర లో వడ్డెరలతో ఆత్మీయ సమావేశం జరుపుతారు.పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు, ఓడిసి మండలాల్లో పర్యటించిన వడ్డెర సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువ గళం పాదయాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం జరుపుతారని ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం లోని వడ్డెర సోదర, సోదరీమణులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి శ్రీ సత్య సాయి జిల్లా కన్వీనర్ పల్లపు రవీంద్ర పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ ఆదేశాల మేరకు శనివారం ఓడిసి, అమడుగురు మండలాల్లో వడ్డెర సంఘం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ప్రస్తుత వైకాపా పాలనలో వడ్డెర్లు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని తెలుగుదేశం పార్టీతోనే వడ్డెర్ల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంగం నాయకులు మాజీ ఎంపీపీ రామచంద్ర, కిష్టప్ప, నాగరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెరిపిటి అంజనప్ప, ఒడిసి మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, పల్లపు లక్ష్మీనారాయణ, వడ్డెర సాధికార సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ పల్లపు మహేంద్ర, ఐటిడిపి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin