సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బుధవారం ఉదయం 8 గంటల నుంచి వాహన తనిఖీలు చేస్తుండగా. సుమారు 9:15 నిమిషాలకు బూర్గంపహాడ్ ఎస్ఐ సంతోష్ కుమార్, మరియు అతని సిబ్బంది కలసి మొరంపల్లి బంజర ఫారెస్టేచెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, భద్రాచలం వైపు నుంచి ఒక ఐషర్ డీసీఎం వ్యాన్ రావడం గమనించి, ఆ వ్యాన్ ను ఆపగా వ్యాన్ ఆపకుండా ముందుకు వెళ్లడంతో, పోలీసు వారిని వెంబడించి జింకలగూడెం SRLIP వంతెన వద్ద MH 16 AE 2254 వ్యాన్ & వ్యాన్ లోని వ్యక్తులను పట్టుకున్నారు. గంజాయి విలువ 53 లక్షల ఉంటుందని సిఐ నాగరాజు వెల్లడించారు. విచారణలో వాళ్ళు చింతూరు నుంచి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అంగీకరించారు. వారితో పాటుగా వారి ఓనర్ పప్పు మామ మరియు సత్యజిత్ వారికి సహకరించినట్లుగా చెప్పినారు. అతను, అతని యజమాని పప్పుమామ మరియు సత్యజిత్ కారుపై చింతూరుకు వెళ్లగా, క్లీనర్ 2 రోజుల క్రితం బస్సులో చింతూరుకు చేరుకున్నాడు. అతని యజమాని పప్పు మామ చింతూరులోకి వెళ్లి వ్యానులోని ఇనుప సెల్ఫ్లోకి ఎండు గంజాయి ప్యాకెట్లను అమర్చాడు. ఈరోజున చింతూరు నుండి వారు ఐచర్ వ్యాన్ ని వారి స్వగ్రామము (ఉస్మానాబాద్) నకు తీసుకొని వెళుతుండగా పోలీసు వారు పట్టుకున్నారు. నిందితులు A3 & A4 ముందుగానే కారులో పారిపోయారు. గంజాయి విలువ సుమారు 53 లక్షల 15 వేలు ఉంటుందని పేర్కొన్నారు...
-----------------------
Admin