సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతదేశ మహా సైన్యాధికారి బ్రిగేడ్ మహమ్మద్ ఉస్మాన్ అన్సారి 111వ జయంతి సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ హాజరై మాట్లాడుతూ మహమ్మద్ ఉస్మాన్ అన్సారి ఒక సెక్యులర్ భావజాలం గల ఉన్నతమైన వ్యక్తి అని కీర్తించారు ఆయనకు మహా వీర్ చక్ర బిరుదు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు భారతదేశంలో ఉండి పాకిస్తాన్ దేశంతో పోరాడుతూ వీర మరణం పొందారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎండి ఖాలేద్ అహ్మద్ . మాట్లాడుతూ మొహమ్మద్ ఉస్మాన్ అన్సారి చాలా పెద్ద దేశభక్తులని అన్నారు భారతదేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ ఆయనను ఆహ్వానిస్తూ ఆర్మీ సుప్రీం జనరల్ గా నియమిస్తామని చెప్పినా ఆయన భారతదేశానికే సేవ చేస్తానని నిర్ణయించుకున్నారని దేశం కోసం వీరమరణం పొందారు అన్నారు. అందుకే ఆయనకు. నౌ షేర్ కా షేర్ అనే బిరుదు కూడా ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు సయ్యద్ సలీం. రిటైర్డ్ హెచ్ఎం హమీద్ ఖాన్ , ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద గల బ్రోచర్ని బుక్స్ కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్. ఎం ఎ రషీద్. అయుబ్ ఖాన్. గౌస్ ఖాన్. కళాశాల ప్రిన్సిపాల్ వినోద . కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin