సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని భవన నిర్మాణ కార్మిక సి ఐ టి యు అనుబంధ సంఘ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు శీలం వేణు అధ్యక్షతన లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేసే శ్రమజీవుల పక్షాన నిరంతరం పోరాడే పార్టీ వెంట నిలుస్తామని భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు.కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను ఊడిగం చేయుటకు ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్ కోడ్, కార్మిక చట్టాల రద్దు, ఉచిత హామీలు ఇచ్చే పార్టీలని బొంద పెడతామని రానున్న రోజుల్లో ప్రజాల కార్మిక కర్షక మంచి కోరే రాజ్యం రావాలని అన్నారు.సామ్రాజ్య వాద శక్తుల అండతో గాజా పై ఇజ్రాయిల్ దేశం కొనసాగిస్తున్న ఘోరమైన మారణ కాండను ఖండిస్తున్నా మని ఇజ్రాయిల్ ప్రధాని నేత న్యూహు యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చల్లా జై కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు ఉప్పతల వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా టౌన్ అధ్యక్షులు శీలం వేణు టౌన్ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి వెంకన్న కోశాధికారి కంచు పాటి రాంబాబు, తమ్మి శెట్టి రాములు, పల్లపు రామకృష్ణ ,నకిరేకంటి అంజయ్య, అశోక్, మేళ్ల చెరువు సాయి, సూర్యనారాయణ చారి, రాకేష్ ,మధు నాగుల్ మేరా, వీర నాగేశ్వరరావు, ములకలపల్లి పద్మ ,వేముల నాగమ్మ ,శాంతయ్య, వెంకట నరసయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin