సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సోమవారం పరకాల మండలంలోని లక్ష్మీపురం, వెల్లంపల్లి, పోచారం,కామారెడ్డి పల్లి గ్రామాల్లో సి ఆర్ ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు లక్ష్మీపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని,ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని,ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
-----------------------
Reporter