సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఈనెల 29వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అరుంధతి భవనం నందు జరిగే దళిత జర్నలిస్టుల ఆత్మగౌరవ సభ కరపత్రాలని గురువారం దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు మాట్లాడుతూ... దళిత జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి ఒక్కరికి దళిత బందు వర్తింపజేయాలని, అక్రిడేషన్ కమిటీ లో దళిత జర్నలిస్టులకు స్థానం కల్పించాలని, దళితుల పత్రికలకు ప్రకటన ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతోపాటు దళితుల జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ దళిత జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలదాస్ కథలప్ప, ఉమ్మడి మాగనూర్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, మక్తల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి దినేష్, , మక్తల్ మండల ఉపాధ్యక్షులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin