సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ లో గొర్రెలను అమ్ముకుని తిరిగివస్తూ షాద్ నగర్ అనూస్ జంక్షన్ వద్ద వాహనం అదుపుతప్పి లారీకి ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు చనిపోయిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం మాందాపూర్ కు చెందిన బొలెరో డ్రైవర్ అశోక్, తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన శంకర్, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు నార్యా నాయక్, తండాకు చెందిన రవిలు ఈ ప్రమాదంలో మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలిపిన మంత్రి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
-----------------------
Admin