సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని స్థానిక వడ్డెర్ల సంఘం కార్యాలయంలో వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మల్లెల జయరామ్ నాయకత్వంలో ఆదివారం వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వడ్డేర్లు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, వడ్డెర్లకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సంఘం తరపున ఆర్థికంగా ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటానని మల్లెల జయరాం భరోసా ఇచ్చారు. ఉప్పుతోళ్ళ సుధాకర్ మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గానికి బీసీలకు కేటాయిస్తే వడ్డెర కుల నాయకుడు మల్లెల జయరాంకు కేటాయించాలని కోరారు. బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవాలని 2001 నుంచి ప్రత్తిపాధనలో ఉన్నందున 2024 ఎన్నికల్లో బీసీ వర్గంలో వడ్డెర కుల నాయకుడు మల్లెల జయరాంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వడ్డెర కులాభివృద్ధికి, సంఘానికి పని చేసి ఆర్థికంగా ఖర్చు పెట్టి నష్టపోయాడని, ఇలాంటి నాయకుడికి ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆపార్టీకి పని చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి వేముల గోవిందరాజులు, జిల్లా యూత్ అధ్యక్షుడు వడ్డే నాగార్జున, స్థానిక నాయకులు సుధాకర్, రామచంద్రప్ప ,రమణ ,కిష్టప్పతో పాటు ఓబులదేవర చెరువు, అమడగురు మండలాకు చెందిన వడ్డెర కులస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin