సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర లో రాష్ట్ర మహాసభలకు భారీగా తరలి వెళ్ళిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 5వ మహాసభలకు మధిర డివిజన్ నుండి ఉపాధ్యాయులు శుక్రవారం నాడు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, మధిర డివిజన్ నాయకులు ఏ. వినోద్ రావు, బండారు నాగరాజు, అనుమోలు కోటేశ్వరరావు, జి. రామకృష్ణ ఆధ్వర్యంలో తెల్లవారుజామున మధిర ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాధ్యాయులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు... ఈ కార్యక్రమంలో కస్తూరిబాయి, భీమశంకర రావు, లాల్ అహ్మద్, హసీనా బేగం, అనితాదేవి, నిర్మల, కొండలరావు, భాస్కరరావు, సాంబయ్య, ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin