సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం పశు వైద్య అంబులెన్స్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న తమకు సకాలంలో వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక 1962 అంబులెన్స్ చొప్పున మూగజీవులకు వైద్య సేవలు అందిస్తున్నామని ఈ అంబులెన్స్ లో వెటర్నరీ డాక్టర్ .డ్రైవర్. అటెండర్ .తో పాటు మరొకరు విధులు నిర్వహిస్తుంటారు .గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తూ నిత్యం రైతులకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు కొన్ని నెలలుగా తమకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని పశువైద్య అంబులెన్స్ సిబ్బంది కోరారు...
-----------------------
Admin