సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ బాలరాజ్ మాస్టర్, అహ్మద్ మాస్టర్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తండ్రిలకు విద్యార్థినిలచే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తండ్రి తన కూతుర్లు గాని కుమారులకు గాని తను పస్తులుండి తన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వాడే తండ్రి వారి కలలను సాకారం చేసి ఎన్నో రకాల వ్యయ ప్రయాసలకు గురై తను మాత్రం తన పిల్లలు అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని ఆశించేవాడే తండ్రి. తండ్ర అంటే ఒక ధైర్యం. ప్రతి ఒక్కరూ విద్యార్థినీ విద్యార్థులు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ మాస్టర్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin