సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండల కేంద్రంలో (భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ) ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం జన్ను రమేశ్ పాల్గొని మాట్లాడుతూ చెన్నారావుపేట , ఖాదర్ పేరు , జోజిపేట , గ్రామాలలో ఉన్న 356 సర్వేనెంబర్ గల అసైన్మెంట్ భూములకు పట్టాలు చేసి పాస్ బుక్స్ రైతులకు అందించాలని అన్నారు 1971 సంవత్సరంలో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రములు ఏర్పాటు చేసి ఒక్కో రైతుకి నాలుగెకరాల 13 గుంటల వ్యవసాయ భూమి ఇచ్చి బావులు తవ్వించి వ్యవసాయం చేసుకొనుటకు ఎద్దుల బండి రైతులకు ఇచ్చినారు , మరియు నివాసం ఉండుటకు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు 1979 80 సంవత్సరంలో రైతు పాస్ పుస్తకములు మంజూరు చేశారు ఆనాటి నుండి రైతులు వ్యవసాయం సేద్యం చేసుకుంటూ జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు గత 50 సంవత్సరాల నుండి రైతులు వ్యవసాయ భూమి సేద్యం చేసుకుంటూ ఉన్నారు 2001లో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఆమోదించిన వందలాది ఎకరాల భూమి రైతులందరికీ లావుని పట్టాదార్ పాస్ పుస్తకములు మంజూరు చేసినారు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు, బ్యాంకు రుణాలు, రుణమాఫీ, సహకార సంఘాల నుంచి వచ్చే రుణాలు రైతులకు అందడం లేదని వీటికి పట్టాలు పట్టా పాస్ బుక్కులు లేవ్వని బ్యాంకులో నుంచి సహకార సంఘాల నుంచి ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత 50 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజా ప్రతి నిధులు,అధికారులు మారుతున్నారు కానీ ఇప్పటివరకు రైతులకు పట్టాలు చేయడం లేదు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే భూభారతి ద్వారా 356 సర్వేనెంబర్ గల రైతుల పంట భూములకు పట్టాలు పాస్ బుక్స్ రైతులకు అందించాలి అన్నారు ఈ కార్యక్రమంలో కోరేమియా అబ్బదాసి అశోక్ , మొర్రి శ్రీను రాజిరెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter