సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా కల్గిన మిర్యాలగూడ,నాగార్జున సాగర్ నియోజకవర్గాలలో గిరిజన విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలతో పాటు,గిరిజన మారుమూల తండాల అభివృద్ధి కోసం ట్రికార్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు కమిటి సభ్యులు,తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆడవత్ శరత్ నాయక్ కు ఆదివారం కొండ్రపోల్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరత్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జనాభా అత్యదికం గల నియోజకవర్గాల్లో గిరిజన అక్షరాస్యత పెంపుదలకు ఆదర్శ ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు అవశ్యకమని చెప్పారు.దాంతో పాటు కనీస సౌకర్యాలు లేని మారుమూల తండాలు, అవసాల అభివృద్ధి, కనీస సౌకర్యాలు కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.వినతి పత్రం సమర్పించిన వారిలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు మక్ల, జైత్రం నాయక్, దీరవత్ మోహన్ నాయక్,సైద నాయక్, జామ్ల నాయక్,కౌన్సిలర్ రవి నాయక్,శశిధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin