సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక గ్రామసభలు దుగ్గొండి మండలంలోని 34 పంచాయితీలలో విజయవంతమయ్యాయి, ఎంపీడీవో డాక్టర్ లెక్కల అరుంధతి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీధర్ గౌడ్, ఆధ్వర్యంలో సంబంధిత గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శిలు, ఎంతో ఓర్పు నేర్పుతో గ్రామసభలలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించారు. ప్రజల సమస్యలు వింటూ గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులు డిమాండ్లను రిజిస్టర్ లలో నమోదు చేసుకున్నారు. ఎట్టకేలకు గ్రామ సభలను సర్పంచ్, ఉపసర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులు విజయవంతం చేశారు.
-----------------------
Reporter