సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ): గృహలక్ష్మి పథకంలోని ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలనే నిబంధనను రామవరం ప్రాంతానికి సడలింపు ఇవ్వాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . సోమవారం జరిగిన డ్వాక్రా గ్రూపుల మహిళల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు ఎంక్వయిరీ లా పేరుతో గృహ లక్ష్మీ పథకం అర్హత సాధించాలంటే ఇంటి స్థలానికి రిజిస్టర్ పట్టా కావాలని నిబంధన విధించడం సరికాదని ఆమె విమర్శించారు. ఈ నిబంధన ద్వారా రామవరం ప్రాంత ప్రజలకి గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రి గంగుల కమలాకర్ మహాలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని వాట్సాప్ లో వచ్చిన అప్లికేషన్ అది బోగస్ అని తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి, అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు ,బ్యాంక్ అకౌంటు ఉంటే సరిపోతుందని అలాగే ఇంటి స్థలం కి గ్రూప్ లేని వారు పాత గృహానికి ఉండే కరెంట్ బిల్లు ,ఇంటి పన్ను బిల్లు పెడితే సరిపోతుందని, అలాగే గ్రామకంఠ భూములకు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదని పత్రికా ముఖంగా వెల్లడించిన మంత్రి మాటలకు విలువ లేదని ఆమె ప్రశ్నించారు. ఇది నిరంతర ప్రక్రియని మంత్రి చెప్పిన మాటలకు అనేకమంది ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని నమ్ముకొని తారీకు దాటిన తర్వాత సంబంధిత ఆఫీసులకు దరఖాస్తు ఫారాలు అందించేందుకు పోతే పదో తారీకు రోజే చివరి డేట్ అని సమాధానం చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారని ఆమె అన్నారు. అందుకే రామవరం ప్రాంతం 1/70 లో ఉందన్న గత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి నిబంధన లేకుండా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లుగానే రామవరం ప్రాంతానికి గృహలక్ష్మి ఇళ్లను మంజూరు చేయాలని ఆమే అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు కవిత, సునీత, బేగం, సింధు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin