సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇవ్వబోయే ప్రాధాన్యతపై సభ పెట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీల సమస్యలపై చర్చ జరిపి వాటిపై డిక్లరేషన్ సభ ద్వారా భరోసా కల్పించాలని బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న వేళ చైర్మన్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో గాంధీభవన్ లో బీసీ డిక్లరేషన్ సమావేశం నిర్వహించారు. డిక్లరేషన్ లో ప్రకటించాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను ఇవ్వాలని ప్రభాకర్ కోరారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు, డిక్లరేషన్ కమిటీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడుతు బిసి డిక్లరేషన్ సభలో బడుగు బలహీన వర్గాలైన బీసిలకు సంబంధించిన అందరికి చేయబోయే సంక్షేమాన్ని, వారికి అందిచబోయే అభివృద్ధి గురించి స్పష్టం చేయగలిగితే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బిసిల కోసం ఎం చేసింది ఇప్పుడు ఎం చేయబోతుందో చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ లకు అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి రాజ్యాధికారం దక్కేలా చూడాలన్నారు. బీసీ లోని అన్ని కులాలకు చెందిన ప్రజలకు భరోసా కల్పించాలని, కుల జనగణన జరిపి వారికి సంక్షేమ పథకాల్లో సమాన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మార్పులు చేశారే తప్ప కొత్తగా ఏవి అందుబాటులో తీసుకురాలేదన్నారు. దళిత, గిరిజనుల కోసం ఏవైతే పథకాలు అందించనున్నారో అలానే బీసీల కోసం కూడా అమలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రధాన్యతపై సిఫార్సులు చేయాలని కోరారు. గాంధీభవన్లో జరిగిన బిసి డిక్లరేషన్ కమిటీ సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, కుమార్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు జకారం శేకర్, అశోక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin