సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఢిల్లీలో జరిగిన ఘనతంత్ర వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ డప్పు కళా బృందం మహిళా డప్పు కళాకారులూ పాల్గొని చక్కని ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డా,, మామిడి హరికృష్ణ సహకారంతో. సంగీత నాటక అకాడమీ అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ అని గారి సౌజన్యంతో ఢిల్లీ పరేడ్ లో డప్పు ప్రదర్శన చేయటం సంతోషకారం అని అన్నారు.నారీశక్తి లో మహిళలే డప్పులు కొట్టడం పల్లెటూరు నుండి దేశ రాజధాని ఢిల్లీ లో డప్పు కొట్టడం ఆనందంగా ఉంది అని మాస్టర్ అమరవరపు సతీష్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఢిల్లీ పరేడ్ లో పాల్గొన్నా డప్పు కళాకారులూ అప్పన్నపేట గ్రామానికి చెందిన కల్పనా, నాగమణి, సంధ్య, అనురాధ,భువనేశ్వరి , రోష్ణవి, పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మార్త, అనిత, కల్మల్చెరువు గ్రామానికి చెందిన లావణ్య ధనమ్మ, పొనుగోడు గ్రామానికి చెందిన రజిత, నవ్య నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన సంధ్య మహిళా డప్పు కళాకారులూ పాల్గొన్నారు..
-----------------------
Admin