సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి రూరల్ మండలం కాలసముద్రం గురుకుల పాఠశాల ఆవరణంలో కదిరి నియోజకవర్గస్థాయి పాఠశాలల క్రీడా సెలక్షన్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. మొదట ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో ప్రత్యేక చొరవచూపాలన్నారు. ప్రతి విద్యార్థి విద్యా రంగంలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి రాదాభాయి, సభా అధ్యక్షులు జాన్ రెడ్డప్ప, ప్రిన్సిపల్ దాదా పీర్, ఎస్.జి.టి అంజన్న, కోఆర్డినేటర్ చంద్ర నాయక్, పిడి అసోసియేషన్ అధ్యక్షులు భయ్యా రెడ్డి, సెక్రెటరీ లష్కర్ నాయక్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి, పిడి ఉగాదు నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంద్రారెడ్డి, కౌన్సిలర్ ఖాసీం వలి, పిచ్చిలి శంకర, రంగా రెడ్డి, ఎస్టీ సెల్ క్రిష్ణ నాయక్, కేటీఆర్ ప్రసాద్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాబ్ జాన్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin