సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామం గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం శంబయపల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అసోలా సురేష్, పాలకవర్గం,జిపి సిబ్బంది, దేశాయిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు, గ్రామస్తులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంబయపల్లి -దేశాయిపల్లి అడ్డరోడ్డు ప్రధాన రహదారి పై పిచ్చి మొక్కలను మరియు రోడ్డుకు ఇరువైపులా వాలిన చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డు వెడల్పు చదును చేశారు. గ్రామాభివృద్ధి లో గ్రామస్తులు భాగస్వాములై సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దిలీప్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter