సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈరోజు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం యందు ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఆదివాసి JAC నాయకులు, పోడిగాని ప్రభుత్వ భూమిలో పొందిన గిరిజనేతరులు పొందిన తప్పుడు పట్టేదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ తో ఊకే ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ములకలపల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ లో కొంత ప్రభుత్వ భూమి 1940 సం,, సేత్వార్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ భూమిగా నమోదు అయి ఉన్నది, కానీ ములకలపల్లి ఎమ్మార్వో మరియు సిబ్బందితో కుమ్మక్కై పోడి గాని ప్రభుత్వ భూమిని పోడి అయినట్లు తప్పుడు నెంబర్లు సృష్టించి 1954 నుంచి వారసత్వ భూమి అని తప్పుడు పట్టాలు పొందినారు కానీ వారు చూపించే నెంబర్లు ధరణి వెబ్సైట్లో చూపించే నెంబర్లు వేరు కావున ఈ భూమి 1/70 Act పరిధిలో ఉన్నది కావున ప్రభుత్వ భూముల్లో గిరిజనేతరులు పట్టాలు పొందే హక్కు ఏ చట్టంలో లేదు కావున తక్షణమే వారికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను Section (8) ప్రకారం వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసి JAC నాయకులు ఊకే ముక్తేశ్వరరావు, బాడిశ బిక్షం దొర, సోయం సత్యనారాయణ, సోయం చిన్నారి, ఆర్ఎం ప్రశాంత్, కాక పృథ్వి, సోయం కృష్ణ కుమార్, శెట్టిపల్లి రజిని బాబు, ఊకే పెద్దమ్మాయి, కొండ్రు పద్మ, కుంజ రవి, కొండ్రు శ్రీరాములు, ఊకె బుల్లిబాబు, పదం నాగరాజు, మరియు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin