సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : అభివృద్ధి ప్రదాతను పేద ప్రజల ఆపద్బాంధవుడను పిలిస్తే పలికే నాయకుడను ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓటేసి పట్టం కట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని యానం బైలు, కిన్నెరసాని, పూసల తండా, కోడిపుంజుల వాగు, పుల్లాయి గూడెం, పునుకుల, బంజారా కాలనీ, కరకవాగు, సీతారాంపట్నం, ఎస్సీ కాలనీ, ప్రియదర్శిని కాలనీలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారాన్ని నిర్వహించేందుకు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావుకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు నృత్యాల మధ్య తోడుకొని వెళ్ళగా వివిధ ప్రాంతాలలో జరిగిన సభల్లో వనమా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి అగొద్దోంటే బి ఆర్ ఎస్ గెలవాలన్నారు. ప్రగతిని గెలిపియాలని తద్వారా పల్లెలు మెరుస్తాయన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. మోసపూరితపు హాయ్ మాటలతో డబ్బు సంచులతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న పార్టీలను నమ్మొద్దని సూచించారు. బి ఆర్ స్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి అని తెలంగాణ గొంతుక అయిన కెసిఆర్ తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అందుకు తనను ఈ నియోజకవర్గం నుంచి గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. బిఆర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను ఉంచేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. బి ఆర్ ఎస్ అధికారంలోకి రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 3000 రూపాయల పెన్షన్ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా గ్యాస్ సైతం 400కే ఇవ్వడం జరుగుతుందన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బి ఆర్ ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin