సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి అర్బన్ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి జరగాలంటే తిరిగి టిడిపి అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు పుట్టపర్తి అర్బన్ పరిధిలోని ఎనుములపల్లిలోని 12 మరియు 14 వార్డులలో "ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి " కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పల్లెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వంలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకొని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో జీవితాలు బాగుపడాలంటే అనుభవజ్ఞులైన చంద్రబాబు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, అందుకు ప్రజల్లో లభిస్తున్న విశేష స్పందనే సాక్షమని వివరించారు....
-----------------------
Admin