Wednesday, 29 July 2026 10:22:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సమన్వయ కమిటీ...

Date : 20 November 2023 11:50 AM Views : 240

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : యటపాక మండలం : తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ఉమ్మడి కార్యాచరణ లో భాగంగా రాష్ట్రం లో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుండాల కాలనీ గ్రామం లో తెలుగు దేశం పార్టీ యటపాక మండల అధ్యక్షుడు పుట్టి రమేష్ మరియు జనసేన మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్ , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు నలజాల మధు ఆద్వర్యంలో గుంతల రోడ్డు మీద ట్రాక్టర్ నడుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ గత తెలుగు దేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల లో ఒక్క రోడ్డు కూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని , ప్రజలు మోటార్ వాహనాల మీద కాకుండా ట్రాక్టర్ మీద వెళ్లాల్సిన దుస్తితి ఈ రాష్ట్రం లో ఉంది అని , 10 లక్షల కోట్ల అప్పులు చేసి నవరత్నాలు అని ప్రజలను మోసం చేయడం తప్ప గ్రామాలలో కనీసం ఒక్క సిమెంట్ రోడ్లు కూడా వేయలేదని నాయకులు ఆరోపించారు.. తెలుగు దేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి గా ప్రజల సమస్యల మీద పోరాడుతూ రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలతో కలిసి పోరాటం చేసి గద్దె దించుతాం అని నాయకులు తెలిపారు.. ఈ కార్యక్రమం లో గొమ్ము కొత్తగూడెం ఎంపీటీసీ పాయం దేవి ,మండల కార్యదర్శి గొల్లపల్లి అప్పలస్వామి , బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్యం సురేష్ గౌడ్ , తెలుగు మహిళ మండల కార్యదర్శి టేకుమల్ల రూప , బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రాసాల నరసింహరావు ,జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎడ్ల లోకేష్ మంద సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శి కొయ్యల రాజు సంయుక్త కార్యదర్శి కొట్టే ప్రశాంత్ ఎడ్ల సాయి మాదాసు రామ్ తేజ సాయి చరణ్ ఉమేష్ రాజేష్ ప్రశాంత్ ప్రదీప్ సాయి వివేక్ ఎడ్ల గణేష్ జి సాయి బైరు సుభాష్ బైరు వెంకీ అధిక సంఖ్యలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు మరియు జనసైనికులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :