సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : యటపాక మండలం : తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ఉమ్మడి కార్యాచరణ లో భాగంగా రాష్ట్రం లో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుండాల కాలనీ గ్రామం లో తెలుగు దేశం పార్టీ యటపాక మండల అధ్యక్షుడు పుట్టి రమేష్ మరియు జనసేన మండల అధ్యక్షుడు మారాసు గంగాధర్ , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు నలజాల మధు ఆద్వర్యంలో గుంతల రోడ్డు మీద ట్రాక్టర్ నడుపుతూ ధర్నా నిర్వహించడం జరిగింది.. నాయకులు మాట్లాడుతూ గత తెలుగు దేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల లో ఒక్క రోడ్డు కూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని , ప్రజలు మోటార్ వాహనాల మీద కాకుండా ట్రాక్టర్ మీద వెళ్లాల్సిన దుస్తితి ఈ రాష్ట్రం లో ఉంది అని , 10 లక్షల కోట్ల అప్పులు చేసి నవరత్నాలు అని ప్రజలను మోసం చేయడం తప్ప గ్రామాలలో కనీసం ఒక్క సిమెంట్ రోడ్లు కూడా వేయలేదని నాయకులు ఆరోపించారు.. తెలుగు దేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి గా ప్రజల సమస్యల మీద పోరాడుతూ రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలతో కలిసి పోరాటం చేసి గద్దె దించుతాం అని నాయకులు తెలిపారు.. ఈ కార్యక్రమం లో గొమ్ము కొత్తగూడెం ఎంపీటీసీ పాయం దేవి ,మండల కార్యదర్శి గొల్లపల్లి అప్పలస్వామి , బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్యం సురేష్ గౌడ్ , తెలుగు మహిళ మండల కార్యదర్శి టేకుమల్ల రూప , బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రాసాల నరసింహరావు ,జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎడ్ల లోకేష్ మంద సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శి కొయ్యల రాజు సంయుక్త కార్యదర్శి కొట్టే ప్రశాంత్ ఎడ్ల సాయి మాదాసు రామ్ తేజ సాయి చరణ్ ఉమేష్ రాజేష్ ప్రశాంత్ ప్రదీప్ సాయి వివేక్ ఎడ్ల గణేష్ జి సాయి బైరు సుభాష్ బైరు వెంకీ అధిక సంఖ్యలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు మరియు జనసైనికులు పాల్గొన్నారు
-----------------------
Admin