సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలో దశాబ్దాల కాలంగా మక్తల్ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా కోర్టుకల నేటితో వారి నిరీక్షణకు తెరపడనుంది. శనివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు మక్తల్ బస్టాండ్ సమీపంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయం పక్కన గతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న భవనంలో... మక్తల్ సివిల్ కోర్టు ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దశాబ్దాల తరబడి మక్తల్ ప్రాంతవాసులు.. ముఖ్యంగా కర్నాటక సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలు దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణించి నారాయణపేట్ కోర్టుకు కేసుల కోసం హాజరు కావలసిన దుస్థితి ఉండేది. అయితే మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి ఎన్నికైన వెంబడే మక్తల్ కోర్టు ప్రక్రియ ఉపందుకోగా.. చివరకు అనేక అవాంతరాలను దాటి ఎట్టకేలకు శనివారం రోజు మక్తల్ కోర్టు..ఈ ప్రాంత వాసుల కోసం అందుబాటులో రానుంది. కోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతవాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసుల కోసం వందల కిలోమీటర్లు తిరిగే పరిస్థితి తప్పుతుందని ఆనందపడుతున్నారు. ముఖ్యంగా మక్తల్ లో కోర్టు ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి చొరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
-----------------------
Admin