సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతె మండల పరిధిలో బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె ఇరుగు అస్మిత (15) శనివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఈ నెల 10 వ తేదీన ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి పాఠశాలలో అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. దాని కారణంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులు పాటు (హోం సిక్) సెలవులు పాఠశాలకు ఇవ్వడంతో సెలవుల కోసం అస్మిత హైదరాబాద్ కు వెళ్ళింది. శనివారం ఉదయం అస్మిత తల్లి జ్యోతి హాస్టల్ కి వెళ్దామని అస్మిత కి చెప్పి రోజువారీగా తన తల్లి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి చున్నితో ఉరేసుకుని మరణించినట్లు తెలిపారు. పాఠశాలకు వెళ్లే రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానస్పదంగా మారింది...
-----------------------
Admin