సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పేదలందరికీ గ్రృహలక్ష్మి పథకం మంజూరు చేయాలి.... ఇంటి స్థలాలు లేని వారికి ప్రభుత్వ భూమి ఇవ్వాలి .... నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి...? - రేపాకుల శ్రీనివాస్, సొంత ఇల్లు లేని పేదలందరికీ గ్రృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మంచికంటి భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి స్థలం తో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయడం లో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు,ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు, గృహలక్ష్మి కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు, ఒక్కో దరఖాస్తు కు వందల రూపాయలు ఖర్చు చేసిన పేదలకు ఏం సమాధానం చెప్పి చెబుతారని ఆయన ప్రశ్నించారు, పరిమితులు లేకుండా అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, పోడుసాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేదింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు,ప్రజా పంపిణీ వ్యవస్థ ను బలోపేతం చేయాలని పేదలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు 14రకాల సరుకులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు,,ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య,బి.చిరంజీవి, శెట్టి వినోద, ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, మర్మం చంద్రయ్య,పి.వేణు,అబీద తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin