సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వివిధ ముఖ్య నాయకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన కులాల అభ్యున్నతి కోసమై నిరంతరం వెలిగే సూర్యునిలా ప్రకాశవంతమైన కిరణాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలలో వెలుగులు నింపాలని నిరంతరం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల హక్కులు కాపాడాలని కోరిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈయన బీహార్ రాష్ట్రంలోని చిద్వా ఓ మారుమూల గ్రామంలో జన్మించి దేశంలోనే రెండవ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనమైన నాయకుడని అన్నారు. వారు చూపించిన మార్గంలో అందరూ నడవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నర్వ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి , టౌన్ పార్టీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి , మాజీ ఎంపిటిసి రవిశంకర్ రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పసుల విష్ణువర్ధన్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతు, మధు, జుట్ల సాగర్, బండారి శేఖర్ , దండు వెంకటరెడ్డి, ఎల్లలింగ భూత్పూర్ రఘు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin