సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామం నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి రెవిన్యూ సిబ్బంది పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను తాసిల్దార్ కార్యాలయానికి తరలించడం జరిగింది. రెవిన్యూ సిబ్బంది ట్రాక్టర్లను ఆపుతుండగా అతివేగంతో పారిపోవడానికి ప్రయత్నించి, ఇసుకను రోడ్డుపై కార్చుకుంటూ వెళుతుండగా రాత్రి సమయంలో పొలాలకు దగ్గరికి వెళ్తున్న రైతులు, ద్విచక్ర వాహనదారులను భయాందోళనకు గురి చేశారని జూపెడ, కాకరవాయి, గ్రామస్తులు అన్నారు...
-----------------------
Admin