సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొందుర్గు మండల్ : ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రోజు షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలకేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసిన కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటార్లు ఉండేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాకనే కరెంట్ కోతలు బంధు అయ్యాయని అన్నారు, రైతు బంధావుడు ముఖ్యమంత్రి అనీ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin