Wednesday, 29 July 2026 12:34:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.... తెలుగుదేశం హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు

Date : 29 May 2023 12:27 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లో పేదల పెన్నిధి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మహానాడు పసుపు పండుగ లో పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగంలో నెంబర్ వన్ గా, రాజకీయరంగంలో నెంబర్ వన్ గా నిలిచి పేదల దేవుడుగా కీర్తించబడ్డాడు అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం , పేదలకు పక్కా భవనాలు నిర్మించడం లాంటి ప్రజా రంజకమైన సంస్కరణలు చేసి పేదవాని మనసు గెలుపొందిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి మహనీయునికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల మండల కన్వీనర్ కీసరి నాగ ముదిరాజ్, తెలుగు యువత నాయకులు చల్లా వంశీ , మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎస్ కె మస్తాన్ , షేక్ అజిత్ , అంజయ్య ,నాగరాజు* తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :