సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం లో పేదల పెన్నిధి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మహానాడు పసుపు పండుగ లో పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగంలో నెంబర్ వన్ గా, రాజకీయరంగంలో నెంబర్ వన్ గా నిలిచి పేదల దేవుడుగా కీర్తించబడ్డాడు అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం , పేదలకు పక్కా భవనాలు నిర్మించడం లాంటి ప్రజా రంజకమైన సంస్కరణలు చేసి పేదవాని మనసు గెలుపొందిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి మహనీయునికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల మండల కన్వీనర్ కీసరి నాగ ముదిరాజ్, తెలుగు యువత నాయకులు చల్లా వంశీ , మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎస్ కె మస్తాన్ , షేక్ అజిత్ , అంజయ్య ,నాగరాజు* తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin