సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం విద్యుత్ ఏఈ రామసురారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సిపిఐ మండల కార్యదర్శి ఎం చలపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంట్ చార్జీలు అప్రకటిత కరెంట్ కోతలు ఎత్తివేయాలని ట్రూ ఆఫ్ చార్లెస్ పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసన వ్యక్తం చేశారు తాము అధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని రెండు వందల యూనిట్ల లోపు వారందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని నమ్మబలికిన జగన్ సర్కార్ నాలుగు సంవత్సరాలలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 20 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారు అన్నారు. ఇటీవల విద్యుత్ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా వస్తునాయని ప్రజలు వాపోతున్నారు దాదాపు 1.89 లక్షల (ఒక కోటి ఎనబై తొమ్మిది లక్షల మంది వినియోగ దారులకు ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు పేరుతో 13.500 కోట్ల వృథా ఖర్చుకు రాష్ట్ర ప్రజలపై మారోమారు కరెంట్ చార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దం అవుతుంది అని దీన్ని ప్రజలు అందరు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, మునెమ్మ ,రమణమ్మ ,కాంతమ్మ ఆదిలక్ష్మి ,సరస్వతి, నాగరాజు, వెంకటరమణ ,రవికుమార్ ,అంజన్నప్ప, రమణ ,ఆంజనేయులు, రమణమ్మ , ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin