సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల గ్రామపంచాయతీ కార్మికుల మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు 7 నేలల నుంచి 18 నేలల పెండింగ్లో వేతనాలు ఉండడంతోటి ఇల్లు గడిచే పరిస్థితిలో లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీతాలకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేయాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 26 వేల రూపాయలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్ వేతనాలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నామని కార్మికులు ఆందోళన చెందారు ఇంటిదగ్గర నిత్యవసర వస్తువులు కొనే స్థితి లేక రెషన్ బియ్యం తెచ్చుకొని గడుపుతున్నామని పిల్లల చదువులకు కనీసం పుస్తకాలు కొన లేని స్థితిలో లేమని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారని *ఈ కార్యక్రమాల్లో సిఐటియు మండల కన్వీనర్ షేక్ రన్మియా. తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల మండల అధ్యక్షుడు భూక్య సైదా. నాయక్,gp మండల కార్యదర్శి బత్తుల .వీరస్వామి జిపి కార్మికులు మామిడి. అంజయ్య .బాలచౌరి. గురువారెడ్డి .దేవదానం. మైసయ్య. బిక్షం. కోటేశ్వరరావు .నాగలక్ష్మి. జోస్ . తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin