సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన వారు నాయి బ్రహ్మాణ సేవా సంఘం పట్టణ కమిటీ హుజుర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి, శాలువతో , పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శానంపూడి సైదిరెడ్డి కి వారి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... ఉపాధి కోసం మోడ్రన్ హెయిర్ సెలూన్ లు ఏర్పాటు చేశారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది.నాయి బ్రహ్మాణ పేద కుటుంబాలను ఆదుకుంటాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పిస్తాము. ఇప్పటికే బీసీ బందు అమలు చేస్తున్నాము. కొత్త సెలూన్ లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ బందు కూడా అమలు చేయడం జరిగింది అన్నారు. ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు సైదిరెడ్డి వారు చేస్తున్న అభివృద్ధి కి,సంక్షేమ పథకాలకు మరియు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కి ఆకర్షితులమై, మన ప్రాంత అభివృద్ధిని చూసి మన హుజుర్ నగర్ ప్రాంత వాసి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో భారీ మెజారిటీతో గెలిపించుకుని మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుత్తారి శ్రీనివాస్, అద్దంకి వెంకట్, అద్దంకి శ్రీనవాస్, పిల్లుల్ట రవి తదతరులు పాల్గొన్నారు.
-----------------------
Admin