Wednesday, 29 July 2026 01:18:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే సైదిరెడ్డికి మద్దతు తెలిపిన నాయి బ్రహ్మాణ సేవా సంఘాలు...

Date : 22 November 2023 11:50 AM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన వారు నాయి బ్రహ్మాణ సేవా సంఘం పట్టణ కమిటీ హుజుర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి, శాలువతో , పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శానంపూడి సైదిరెడ్డి కి వారి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... ఉపాధి కోసం మోడ్రన్ హెయిర్ సెలూన్ లు ఏర్పాటు చేశారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది.నాయి బ్రహ్మాణ పేద కుటుంబాలను ఆదుకుంటాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పిస్తాము. ఇప్పటికే బీసీ బందు అమలు చేస్తున్నాము. కొత్త సెలూన్ లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ బందు కూడా అమలు చేయడం జరిగింది అన్నారు. ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు సైదిరెడ్డి వారు చేస్తున్న అభివృద్ధి కి,సంక్షేమ పథకాలకు మరియు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కి ఆకర్షితులమై, మన ప్రాంత అభివృద్ధిని చూసి మన హుజుర్ నగర్ ప్రాంత వాసి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో భారీ మెజారిటీతో గెలిపించుకుని మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుత్తారి శ్రీనివాస్, అద్దంకి వెంకట్, అద్దంకి శ్రీనవాస్, పిల్లుల్ట రవి తదతరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :