సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం లో గత సంవత్సరము జరిగిన అసంబ్లీ ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, టి ఆర్ యస్ పార్టీ లకు చెందిన ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు, అట్టి ఇరువర్గాల వ్యాక్తులను హుజూర్ నగర్ సిఐ జి చలమంద రాజు గరిడేపల్లి ఎస్ఐ హుజూర్ నగర్ ఆర్ డి ఓ శ్రీనివాసులు ముందు 107 Cr.P.C ప్రకారం 12 మందిని బైండ్ ఓవర్ చేయనైనది, దీని ప్రకారం బైండ్ ఓవర్ అయిన వ్యక్తులు ఒక సంవత్సరము కాలంలో ఏదైనా కేసు వారిపైన నమోదు అయినచో వారు Rs.2,00,000/- రూపాయలు కట్టవల్సి ఉంటుంది, అట్టి డబ్బులు కట్టనిచో జైలుకి వెళ్ళాలి, ఇట్టి విషయం ఇరు వర్గాల వారికి తెలియపర్చానైనది. గత సంవత్సరము జరిగిన అసంబ్లీ ఎలక్షన్ సందర్భంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో హుజూర్ నగర్ సర్కల్ నందు గల అన్నీ పోలీసు స్టేషన్ పరిధిలో ఎలక్షన్ కి విగతం కల్గించే వ్యక్తులు అయిన రౌడీలు, సస్పెక్ట్స్, ట్రబుల్-మంగర్స్ మరియు చట్టవ్యతిరేక చేర్యాలకు పాల్పడే వ్యక్తులను అసంబ్లీ ఎలెక్షన్ కి ముందే 110 Cr.P.C ప్రకారం అన్నీ పోలీసు స్టేషన్ పరిధిలో ఎం ఆర్ ఓ ల ముందు బైండ్ ఓవర్ చెయ్యడం జరిగింది, దీని ప్రకారం బైండ్ ఓవర్ అయిన వ్యక్తులు ఒక సంవత్సరము కాలంలో ఏదైనా కేసు వారిపైన నమోదు అయినచో వారు Rs.1,00,000/- రూపాయలు కడతాము అని తమ సొంత పూచీకత్ ఇచ్చినారు, కానీ కొందరు అట్టి బైండ్ ఓవర్ ను లెక్క చేయకుండా అధిగమించి కేసులలో ఉన్నారు, అందులో హుజూర్నగర్ పిఎస్-2, మఠం పల్లి పిఎస్-6, గరిడేపల్లి పిఎస్-1, పాలకవీడు పిఎస్-2 మొత్తం 11 మంది బైండ్-ఓవర్ను అధిగామించినారు, కాబట్టి అట్టి వ్యక్తులను మొత్తం డబ్బులు కట్టించడం లేదు జైలుకు పంపడం జరుగుతుంది అని హుజూర్ నగర్ సి ఐ చలమంద రాజు తెలియపర్చినారు.
-----------------------
Admin