సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం ప్రాంగణంలో గురువారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు హాజరైనారు.ఆనంతరం ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం సమిష్టి గా ముందుకు వెళ్లాలని సూచించారు.మన హక్కుల కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు.మండల వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కులబంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు, రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జక్కుల శ్యాం, ప్రధాన కార్యదర్శి దాసరినారాయణ రావు, ఉపాధ్యక్షులు జాపతి శ్యాంసుందర్, రంగయ్య నాయుడు, సెక్రెటరీ లు శేరు రాంబాబు, రంగయ్య నాయుడు, నానాజీ ,నాయకులు జక్కుల సమ్మయ్య, జొన్నల నాగేశ్వరరావు,కూసం సాంబం, పడాల రమేష్, గార్లపాటి రవి, కందుకూరి వెంకటేష్, బిక్షపతి, నాగేంద్రబాబు, సంతోష్, సాంబం మున్నూరు కాపు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin