సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని ఎసిపి ఎన్ హెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో షాద్ నగర్ ఏసీబీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. వారితో చర్చించిన అనంతరం, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు "మిలదున్నబి పండుగ పురస్కరించుకొని ర్యాలీని షాద్ నగర్ నియోజకవర్గం మొత్తం ఒకటో తారీకు జరుపుకోవాలని నిర్ణయం జరిగిందని, ఆయన తెలిపారు. ఈ సంవత్సరం "గణేష్ నిమజ్జనం" "మిలాదున్నబీ" పండుగ" ఒకేసారి రావడంతో ముస్లిం మత పెద్దలు ఒక మంచి ఆలోచతో "మిలాద్ ఉన్ నబీ ర్యాలీ" డేట్ ను ముందుకు పొడిగించి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని ఇది "గంగా జమున తహిజీబ్ "కు నిదర్శనం అని ఆయన అన్నారు. ముస్లిం మత పెద్దలు పూర్తి సహాకారం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-----------------------
Admin