Wednesday, 29 July 2026 04:54:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పల్లవి మండల సమాఖ్య, సమావేశాలలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్...

Date : 24 November 2022 11:00 PM Views : 490

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం) *పల్లవి మండల సమాఖ్య, సమావేశాలలో జిల్లా పిడి* సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం పల్లవి మండల సమాఖ్య నందు MCLF మండలాల గ్రామసంఘాల లీడర్లకు మూడు రోజులు "విజన్ బిల్డింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్"పైన శిక్షణా కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ K.N.నరసయ్య మాట్లాడుతూ.......ప్రతి సభ్యురాలు కుటుంబ జీవనోపాధిని మెరుగు పరుచుకోవాలి. ప్రస్తుత కుటుంబ పరిస్థితులలో మార్పు తప్పని సరిగా రావాలి. ప్రతి సభ్యురాలు ఒక ఉన్నతమైన కల ఊహించుకుని దానిని సాకారం చేసుకోవడానికి ఈ శిక్షణ నుండే అడుగులువేయాలి. ప్రతి సభ్యురాలు కుటుంబ ఆదాయం నెలకు కనీసం రూ.10000 నుండి రూ.20000 ఉండేటట్లు ప్రణాళిక చేసుకోవాలి. మంచి మండల సమాఖ్యగా ఉండాలి. డి.పి.యం-యల్.హెచ్ రామమోహన్ మాట్లాడుతూ......... పంచసూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఋణమొత్తం వినియోగంలో సంఘానికి 25లక్షలు పరిమితికి చేరాలి. భవిష్యత్ ప్రణాళిక తయారు చేసుకోవాలి. డి.పి.యం- ఐ.బి శ్రీ నాగరాజు మాట్లాడుతూ...... సంస్థాగత నిర్మాణంలో సంఘం నుండి మండల సమాఖ్య వరకు కట్టుబాట్లలో ప్రతి సభ్యురాలు పాటించేవిధంగా చూడాలి, సంఘం నుండి మండల సమాఖ్య వరకు A గ్రేడ్ సాధించాలి అని తెలియచేయడం జరిగింది. కార్యక్రమానికి గ్రామ సంఘం ప్రతినిధులు, మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్, యల్.సి. మునెప్ప, ఏ.పి.యం రమణప్ప, డి.పి.యం.యు నుండి డి.పి.యం_(ఐ.బి) జి.నాగరాజు డి.పి.యం_(యల్.హెచ్ ) పి.రామమోహన్ హాజరు కావడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :