సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గొర్రెలు, మేకల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నట్టల నివారణ మందులను వేసి నట్టలను నివారించినట్లయితే మూగజీవుల యజమానులు లాభాల బాటలో నడుస్తారని నూతన సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో నట నివారణ కార్యక్రమాన్ని చేపట్టగా నూతన సర్పంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసి నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు ఎల్లవేలలా రైతులకు అందుబాటులో ఉండాలని సంబంధిత పశు వైద్యాధికారులకు ఆమె సూచించారు. దేశాయిపల్లిలో దాదాపు 1100 గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులను వేయడమైందని వెటర్నరీ వైద్యాధికారులైన సోమశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది కవిత శివ గ్రామ యాదవులు రైతులు పాల్గొన్నారు.
-----------------------
Reporter