Thursday, 30 July 2026 11:04:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రశాంతమైన ఎన్నికలకు సహకరించండి...

Date : 03 November 2023 07:03 AM Views : 281

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్నందున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ప్రజల అభీష్టాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించడానికి, శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమస్త ప్రజలకు ఈ సందర్భంగా పోలీసు శాఖా తరుపున వారు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఎలాంటి భయం, బెదిరింపు, హింస లేకుండా తమ స్వేచ్ఛాయుత హక్కులను అనుభవించుకోవచ్చని, రేపటి నుండి నామినేషన్లు వేయడం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అభ్యర్థులు ఉదయం11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను వేయవచ్చన్నారు. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 10-11-2023 , అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 15-11-2023 ఉంటుందనీ తెలిపారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలను కాపాడేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను నివారించడానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతులు లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. నామినేషన్లకు సంబంధించి 03-11-2023 నుండి 15-11-2023 వరకు ఆర్డీవో కార్యాలయం వద్ద వంద మీటర్ల (100 మీటర్లు) వ్యాసార్థంలో కేవలం ఐదుగురు (5) మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. పోలీసువారి ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు హెచ్చరించారు. ఈ ఆదేశాలు 03-11-2023 నుండి 15-11-2023 వరకు ఉదయం 10.00 నుండి సాయంత్రం 06.00 వరకు అమలులో ఉంటాయని షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :