సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా శ్రీ వెంకటేశా గోవిందా నమో నమహా అంటూ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. మంగళవారం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా విభాగాల నాయకులు ఆలయ ఆవరణలో 13 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలుపుతో కార్యకర్తల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ గెలవాలని ఆపద మొక్కులవాడికి మొక్కుకున్న అందే మోహన్ తన అనుచరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా అందేమోహన్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టి ప్రజల మద్దతుతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వీర్లపల్లి శంకర్ ఆయురారోగ్యాలతో అభివృద్ధి సాధించాలని అందేమోహన్ తెలిపారు. జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో శంకరన్న గెలిచాడు అంటూ కాంగ్రెస్ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ముబారక్ అలీ ఖాన్, కిట్టు, కడియాల సాయి కుమార్, ప్రదీప్, లడ్డు, నరేంద్ర, గణేష్, సిద్దు, నవీన్, ర్యాకల శ్రీకాంత్, గణేష్, శివ, తేజ, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin