సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఇందుమూలముగా తెలియచేయడం ఏమనగా గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు 05.05.2023 నాడు ఉదయం 10.30ని.లకు Chief Minister Camp Office నుండి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన "వై.యస్.ఆర్ కళ్యాణమస్తు & షాదీ తోఫా" రెండవవిడత నిధుల మంజూరు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. యస్.సి. యస్.టి, బి.సి, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు "వై.యస్.ఆర్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు "వై.యస్.ఆర్ షాదీ లోఫా"ద్వారా వారి తల్లుల బ్యాంకు ఖాతాలలో ఆర్థికసాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా పై కార్యక్రమం ప్రత్యక్ష వీక్షణం ద్వారా శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ హాలు పుట్టపర్తి నందు నిర్వహించండం జరుగును. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లాకు సంబందించి 32 మండలాలు మరియు 05 మునిసిపల్ కార్పొరేషన్/నగరపంచాయతీలలో గల 440 మంది లబ్దిదారులకు రూ.3,12,60,000 ( మూడు కోట్ల పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు) శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా మెగా చెక్కును లబ్ది దారులకు అందించడం జరుగుతుంది. కావున జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి గారు అందరు ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ ప్రతినిధులకు తెలియ చేయవలసినదిగా కోరడమైనది.
-----------------------
Admin