సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక బియ్యపు గోడను వద్ద ఘనంగా మే డే వేడుకలును సీఐటీయూ నాయకులు , హమాలీలు , కార్మికులు, ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా సీఐటీయూ నాయకులు మాట్లడుతూ 1886 మే ఒకటో తేదీన అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినాల కోసం కార్మికులు రక్తం చిందించి, హక్కులను సాధించుకున్నారు. వారిచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీ ఏటా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, మండల కార్యదర్శి శ్రీ రాములు ,మహిళా కార్యకర్త కాంతమ్మ, సిపిఎం మండల కార్యదర్శి రమణ, రైతు సంఘ కార్యదర్శి రామి రెడ్డి ,పంచాయతీ కార్మికులు, పూసల సంఘం నాయకులు, సివిల్ సప్లై సిబ్బంది నాగరాజు, నారాయణస్వామి,అంజనప్ప, సుందరయ్య కాలనీ వాసులు నరసింహులు రెడ్డెమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin