సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు, సూపర్వైజర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు, తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జనవరి నెలలో 19వ తారీఖు రోజున మొదలై, ఇప్పటికీ నిరంతరంగా పరీక్షలు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గురించీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ... షాద్ నగర్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరములు నిండిన వారు 1,24 051 మందికి పరీక్షలు చేయవలసి ఉండగా, ఈరోజు వరకు డివిజన్లోని 6 మండలాలలో 10 కంటి వెలుగు టీమ్ లు పనిచేస్తూ 1,14,178 మందికి కంటి పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. ఇందులో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, వీరిలో దగ్గర చూపు మందగించిన 13,636 మందికి వెంటనే కంటి అద్దాలు (రీడింగ్ గ్లాసెస్) అందజేశారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో దగ్గర చూపు, దూరపు చూపు మందగించిన 6336 మందికి ప్రిన్సుప్షన్ గ్లాసెస్ కోసము ఆడరు ఇవ్వడము జరిగిందని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 14,294 మందికి కాంట్రాక్టు ప్రాబ్లమ్ ఉంది అని గుర్తించి, సరోజినీ దేవి ఆసుపత్రికి రిఫరల్ చేశారని చెప్పారు. ఇప్పటి వరకు షాద్ నగర్ డివిజన్లో 10 కంటి వెలుగు టీములు పనిచేస్తూ విజయవంతంగా కంటి వెలుగు ప్రోగ్రామును నిర్వహిస్తూ ఇప్పటివరకు 92 శాతం కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వచ్చే నెల జూన్ చివరి వారం నాటికి పూర్తిగా అర్హులైన వారి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి 100% సాధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటెడ్ జె శ్రీనివాసులు, డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.
-----------------------
Admin