సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలోని ఎస్టీ కాలనీ కి చెందిన గణేష్ అనే యువకుడు గత కొంత కాలంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నాడని సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని ఎక్సైజ్ సి.ఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. చీఫ్ లిక్కర్, నీళ్లు, మరియు కొన్ని రసాయనాలు కలిపి కల్తీ మద్యం తయారు చేసి సమీపంలోని బెల్ట్ షాపు లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు, అతని వద్ద ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీ మద్యం బాటిల్ లు స్వాధీనం చేసుకుని, గణేశ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పాల్వంచ మండలంలో ఇంకొందరు కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పూర్తి ఆధారాలతో త్వరలో పట్టుకుంటామని తెలిపారు, కల్తీ మద్యం పరీక్షల కొరకు ల్యాబ్ కు పంపి మద్యం లో ఎటువంటి రసాయనాలు కలుపుతున్నారని వాస్తవాలు తెలుస్తాయని ఎక్సైజ్ సి.ఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు.
-----------------------
Admin