సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల పరిధిలోని గ్రామస్థాయిలో సమగ్ర భూ రిసర్వే, తంగేడుకుంట శోత్రియం భూములు రీసర్వేలు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తహసీల్దార్ కుంకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు,సచివాలయ సర్వేయర్లతో కూడిన 5 జట్లుగా ఎంపిక చేసి సమగ్ర భూసర్వే చేపట్టారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ ముఖ్యఅతిధిగా పాల్గోని తంగేడుకుంట పంచాయతీ పరిధిలో లింగాలపల్లి, మద్దకవారిపల్లి, బుచ్చిరాజుపల్లి, నల్లచెరువుపల్లి శోత్రియ సాగుదారులకు గ్రామసభ ఏర్పాటు చేసి భూములకు చెందిన పత్రాలు సర్వే చేపట్టే అధికారులకు అందించలన్నారు. భూసర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తారన్నారు.మండల వ్యాప్తంగా సమగ్ర భూసర్వే త్వరితగతిన చేపట్టి, సేకరించిన నివేదికలు అందించాలని 5 జట్ల సిబ్బందికి అయన సూచించారు.
-----------------------
Admin