సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల లోని గోవింద్ పెట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ ఆధ్వర్యంలో మహాజన సభా నిర్వహించారు. ఇట్టి సమావేశంలో అర్హులైన రైతులకు లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, అలాగే రుణమాఫీ పొందిన వారు, కొత్త రుణాల కు డాక్యుమెంట్స్ సొసైటీ వద్దకు తీసుకు రావాలని అలాగే అసైన్మెంట్ భూములకు కూడా రుణాలు ఇవ్వాలని మార్కె్్పడ్ ద్వారా మక్కలను మద్దతు ధరకు కొనాలని మహా జనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు తూర్పు రాజన్న, కాశిరెడ్డి శ్రావణ్, నల్లూరి రమేష్, లక్కారం చిన్న, నరసింహులు, లక్కారం సాగర్, కొండ గంగాధర్, ఎర్రం వంశీ, గార్ల గంగారం, గోపాసి గంగు, సొసైటీ పరిధిలోని గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin