సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రోజున జిల్లా కలెక్టర్ నిజామాబాద్ ఆదేశాల మేరకు బాల్కొండ తహసిల్దార్ సూచనల మేరకు ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం , మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వయసు 18 సంత్సరాలు నిండిన విద్యార్థుల నుండి ఫారం-6 నమోదు చేయడం జరిగింది. ఇ ఓటరు నమోదు కార్యక్రమం పోలింగ్ కేంద్రాల్లో శనివారం మరియు ఆదివారం నిర్వహించబడునని తెలిపారు. వయస్సు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఆర్ఐ రాఘవేంద్రరావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin