సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటీలోని వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న నూతన పార్కులతో వార్డులు మరింత అభివృద్ధిని సాధించనున్నాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 7,9,27వ వార్డులలో ఒక కోటి రూపాయలతో నూతన పార్కుల ఏర్పాటు 18 వ వార్డులో 38 లక్షలతో అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న పార్కులు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణము అందించనున్నాయి అన్నారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో మున్సిపాలిటీ ఆదర్శంగా మారుతోందని అన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు.
-----------------------
Admin